కూతురిని కాపాడుకోవడం కోసమే..కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ – షర్మిల

-

కూతురిని కాపాడుకోవడం కోసమే..కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ అని విమర్శలు చేశారు వైఎస్‌ షర్మిల. అహంకారం, అధికార మదం మునుగోడులో పోటీ పడుతున్నాయని నిప్పులు చెరిగారు. ఒక్క నియోజకవర్గం కోసం 118 నియోజకవర్గాల్లోని ప్రజలను గాలికొదిలి, పాలన బొందపెట్టి.. దొంగ చాటుగా మద్యం, డబ్బులు పంచుతూ, దిక్కుమాలిన ప్రచారం చేయడానికి సిగ్గుగా లేదా మంత్రులారా ? అని ఆగ్రహించారు.

సొంత నియోజకవర్గాల్లో ఏం ఎలగబెట్టారని? పేదలకు ఇండ్లు లేవు కానీ ఢిల్లీలో బార్&రెస్టారెంట్(BRS) పార్టీ కోసం పెద్ద బిల్డింగ్ అట అంటూ నిప్పులు చెరిగారు. దాన్ని పరిశీలించడానికి KCR వెళ్లాడట.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురిని కాపాడుకోవడం కోసం కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకోవడానికే వెళ్లిండని మండిపడ్డారు. ప్రజా సమస్యలు గాలికి..KCR ఢిల్లీకి, మంత్రులు మునుగోడుకు వెళ్లారని ఆగ్రహించారు వైఎస్‌ షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version