హుటాహుటిన ఆసుపత్రికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

-

సంగారెడ్డి ఆసుపత్రికి చేరుకుని ఎమ్మెల్యే లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

Siddipet MLA Harish Rao visited the family members of MLA Lasya

అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలం లో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండ గా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ తరుణంలోనే ఎమ్మెల్యే లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news