BREAKING : నెహ్రూ జూపార్క్‌లో గంధపు చెక్కల స్మగ్లింగ్ !

-

నెహ్రూ జూలాజికల్​ పార్కులో స్మగ్లింగ్‌ కలకలం రేపుతోంది. కొందరు గుర్తు తెలియని స్మగ్లర్లు నెహ్రూ జూలాజికల్​ పార్కులో స్మగ్లింగ్‌ చేశారట. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నెహ్రూ జూలాజికల్​ పార్కులో వణ్య ప్రాణులతో పాటు ఖరీదైన గంధపు చెట్లు ఉన్నాయి. జూ పార్కులోకి చొరబడ్డ స్మగ్లర్లు 7గంధపు చెట్లను నరికివేశారు. ఆ చెట్లను దుంగలు..దుంగలుగా చేసి అక్కడక్కడ పడవేశారు. ఈ నెల 20వ తేదీన గ్రహించిన జూ అధికారులు 7గంధపు చెట్లను నరికినట్లు గుర్తించారు.

అందులో కొన్ని దుంగలను మాత్రమే జూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని జూ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. జూ పార్కుకు రెండు వైపులా ఎంట్రన్స్​ ఉండడం …. ఆ రెండు ఎంట్రన్స్​లో ఏర్పాటు చేసిన సి.సి కెమెరాలను పరిశీలించినా ఆ గేట్​ల గుండా గంధపు దుంగలను తీసుకెళ్లడం లాంటి దృశ్యాలు కనిపించకపోవడం జూ అధికారులను విస్మయానికి గురిచేసింది. అంతేగాకుండా నరికిన ఏడు గంధపు చెట్లనుంచి కొన్ని దుంగలు కనిపించకుండా పోయిన అవి ఎలా తస్కరించారన్నది మిలియన్​ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక దీనిపై అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news