అవతరణ వేడుకలకు సోనియా గాంధీ.. కన్ఫమ్ చేసిన సీఎం రేవంత్

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తైన సందర్భంగా ఈ వేడుకలకు ముఖ్య అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

జూన్‌ 2వ తేదీన ఉదయం 10 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు, సాయంత్రం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఉత్సవాలకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యక్తిగత ఆహ్వాన లేఖ పంపారు. ఈ లేఖతో పాటు ఆహ్వాన పత్రికను ఆయనకు స్వయంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్‌ విభాగం సలహాదారు హర్కర వేణుగోపాల్‌ను, డైరెక్టర్‌ అరవింద్‌ సింగ్‌ను ఆదేశించారు. గజ్వేల్‌ ఫాంహౌస్‌లో కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక, లేఖ అందించనున్నామని హర్కర వేణుగోపాల్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news