త్వరలో లక్ష మంది మహిళలకు రూ.500లకే సిలిండర్‌.. ప్రారంభించేది ఎవరంటే..?

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.500లకే సిలిండర్, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ  త్వరలోనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తామని తెలిపారు. ఇవాళ ఇంద్రవెళ్లి బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 7వేల స్టాఫ్‌ నర్సుల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

మరో 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.  మేము అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే 6 గ్యారంటీలు పూర్తి కాలేదని అడుగుతున్నారు. కనీసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన చేశారా?.. త్వరలోనే లక్ష మంది మహిళలకు రూ.500లకు సిలిండర్‌.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దర్ అన్నను  మండుటెండడలో నిలబెట్టాడని.. అందుకే గద్దర్ అన్న ఉసురు తాకి బొక్కలు విరిగాయని  పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం పేదోళ్లది పేదల ప్రభుత్వంలో ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news