BREAKING : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర కేసులో బిగ్‌ ట్విస్ట్

-

BREAKING : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర కేసులో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ తో పాటు 18 మందికి నోటీసులు జారీ చేసింది మహబూబ్‌ నగర్‌ కోర్టు. ఈ కేసులో రాఘవేంద్ర రాజు, పుష్ప లత పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు రాజు, పుష్పలత. శ్రీనివాస్ గౌడ్ పై ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు రాజు.

తన ఇంట్లోకి చొరబడి సీసీటీవీ పెన్ డ్రైవ్ హార్దిస్కులను దొంగలించారని పిటిషన్ లో పేర్కొన్నారు. విశ్వనాథ్ సతీమణి పుష్పలత మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదు లో తన భర్త ప్రత్యక్ష సాక్షుడిగా ఉన్నాడని తన భర్తను కిడ్నాప్ చేశారంటూ తెలిపారు పుష్ప లత.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కు కుట్ర పన్నారని ఫిబ్రవరి లో రాజు, విశ్వనాథ్ తదితరులను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇక బెయిల్ పై బయటికి వచ్చాక మహబూబ్ నగర్ కోర్టులో వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ గౌడ్ , సైబరాబాద్ సీపీ, డీసీపీ బాలానగర్ తో పాటు మొత్తం 18 మందికి నోటీసులు జారీ చేసింది కోర్టు. అంతేకాదు ఆగస్టు 10 న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version