టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో తండ్రి వీర్యాన్నీ కాకుండా మరొకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన సికింద్రాబాద్ లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకివెళ్లితే.. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఓ మహిళా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించారు. అయితే.. వీరే వారి వీర్యకణాలతో వైద్యులు సంతానం కలిగించారు. సదరు దంపతులను అనుమానం వచ్చిన డీఎన్ఏ టెస్ట్ చేయిచుకోగా.. శిశువు డీఎన్ఏ వేరే వారిదిగా తేలింది.
దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా.. నిన్న రాత్రి ఆ సెంటర్ ను అదుపులోకి తీసుకొని రాత్రి మొత్తం పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో డా.నమ్రత ను అరెస్ట్ చేశారు పోలీసులు. రాత్రి గోపాలపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాత్రి 2.30 గంటలకు జరిగిన తనిఖీల్లో కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిబ్బందిని లోపలే ఉంచి పోలీసులు ప్రశ్నించారు. రాత్రి 2.30 గంటలకు తనిఖీలు పూర్తి అయిన తరువాత సిబ్బందిని పోలీసులు పంపించారు.