సన్ బర్న్ న్యూ ఇయర్‌ వేడుక టికెట్ల విక్రయం నిలిపివేత

-

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్త సంవత్సరం వేడుక సందర్భంగా నిర్వహించాలనుకున్న ‘సన్‌బర్న్‌ షో’ను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. ఈ మేరకు టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. పూర్తి అనుమతులు తీసుకోకుండా సన్‌బర్న్‌ ఈవెంట్‌ టికెట్ల విక్రయంపై ముఖ్యమంత్రి ఆగ్రహంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆన్‌లైన్‌లో బుక్‌మై షో టికెట్ల అమ్మకాన్ని ఆపేసింది. సన్‌బర్న్‌ ఈవెంట్‌ నిర్వాహకుడు సుమంత్‌పై కేసుసహా.. బుక్ మై షో ఎండీ, నోడల్‌ అధికారికి మాదాపూర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం.. బుక్ మై షో సైట్‌లో విశాఖ వేదికగా సన్ బర్న్ న్యూ ఇయర్ వేడుకకు సంబంధించిన సమాచారమే కనిపిస్తోంది.

హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సన్ బర్న్ షో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద వేడుకను నగరంలో నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా నిర్వాహకులు బుక్ మై షోలో టికెట్లు విక్రయించడం మొదలుపెట్టారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులపై ఫైర్ అయ్యారు. పోలీసులు రంగంలోకి దిగడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు.

Read more RELATED
Recommended to you

Latest news