MLC కవిత పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా

-

దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారులు విచారించారు. అయితే దర్యాప్తు సంస్థలు మహిళలను కార్యాలయాలకు పిలిపించి కాకుండా ఇంట్లోనే విచారించాలని కవిత అధికారులను కోరారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంట్లోనే విచారించాలనే అంశంపై కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్​ విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. దిల్లీ మద్యం కేసు విచారణకు తమ కార్యాలయానికి రావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కవిత పిటిషన్‌ దాఖలు చేశారు.  మార్చి 27న సుప్రీం కోర్టు విచారించి.. కవిత పిటిషన్‌ను నళిని చిదంబరం కేసుతో జత చేసింది. సోమవారం రోజున జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాతో కూడిన ధర్మాసనం ఎదుటకు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ రెండు పిటిషన్‌లతోపాటు బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీల కేసు విచారణను సైతం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version