కంటోన్మెంట్ బరిలో సర్వే సత్యానారాయణ

-

హైదరాబాద్ లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పోటీ చేయనున్నారు. గత కొంత కాలంగా పార్టీకీ దూరంగా ఉన్నారు సర్వే సత్యానారాయణ. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటుండగా.. పార్టీ అధిష్టానం కోరిక మేరకు ఇవాళ నాంపల్లి గాంధీ భవన్ లో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి దరఖాస్తు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని..  సోనియాగాంధీకి మనం గెలిచి బహుమతి ఇవ్వాలి అని పేర్కొన్నారు. ఇన్ని రోజులు రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నాను. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో తాను పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలిపారు మాజీ మంత్రి సర్వే సత్యానారయణ. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజీగిరి ఎంపీగా మళ్లీ పోటీ చేద్దామనుకున్నానని.. ప్రస్తుత ఎంపీ రేవంత్ రెడ్డి అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు సర్వే సత్యనారాయణ. 

Read more RELATED
Recommended to you

Exit mobile version