నిజాం సాగర్ లో ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం లభ్యం ఐంది. ఇక ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. కామారెడ్డి జిల్లాలోని నిజంసాగర్ బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు ముగ్గురు వ్యక్తులు.

ఎల్లారెడ్డికి చెందిన మధుకర్ గౌడ్, తిమ్మారెడ్డికి చెందిన నవీన్, సోమర్ పేట్ కు చెందిన హర్ష అనే ముగ్గురు వ్యక్తులు ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. అయితే ఇందులో మధుకర్ గౌడ్ మృత దేహం లభించింది. ఇక ఈ ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.