నేడు దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారిస్తూ.. మరోవైపు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారు. ప్రజాసంక్షేమంపై ఫోకస్ పెడుతూనే.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇంత బిజీలోనూ తను ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.

ఇక ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎంతోపాటు సీపీఆర్ఓ అయోధ్య రెడ్డి కూడా దిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకోనున్నందున రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రచార సభల్లో పాల్గొనేందుకు  ప్రియాంక, రాహుల్ , ఖర్గేలను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news