చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌..!

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి తాజాగా ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ 135 సీట్లలో విజయం సాధించడం పట్ల కంగ్రాట్స్ తెలిపారు. ఫోన్ లో పలు విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా  చంద్రబాబుకు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్‌ రెడ్డి.

రెండు రాష్ట్రాల విభజన హామీలు.. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామని చంద్రబాబును కోరారు రేవంత్‌ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరారు రేవంత్‌ రెడ్డి. అందుకు చంద్రబాబు కూడా ఓకే చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబుకి మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు త్వరలోనే ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి ఫోన్ చేయడంతో మరింత బలం చేకూర్చినట్టయింది. చంద్రబాబు మాత్రం తాను ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news