ఆ పిచ్చి కుక్కల్ని వదలం.. కొడాలి నాని, వంశీకి బుద్దా వెంకన్న వార్నింగ్..!

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పలువురు టీడీపీ నేతలను వైసీపీ భయబ్రాంతులకు గురి చేసిందనే ఆరోపణలున్నాయి. గతంలో వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో  దీంతో తాజాగా బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు జన్మలెత్తిన తరగని శిక్ష జగన్మోహన్ రెడ్డికి పడిందన్నారు. ఇక జగన్ జీవితం జైలులోనే గడపాలన్నారు. కృష్ణా జిల్లాలో పిచ్చికుక్కల్ని వదిలే ప్రసక్తే లేదని కొడాలి నాని, వంశీలను ఉద్దేశించి అన్నారు. అరేయ్ కొడాలి నాని, వంశీ 2024లోనే తనను చంపేయాలని లేదంటే తాను వాళ్ళను వదిలే ప్రసక్తే లేదన్నారు. తాము అధికారంలో లేనప్పుడు కూడా ఇదే మాట చెప్పానని బుద్దా వెంకన్న క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సతీమణిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినప్పుడే వాళ్లిద్దరి ఓటమి ఖరారైందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news