నేడే తెలంగాణ సీఎల్పీ మీటింగ్‌ .. రాజ్యసభ ఎన్నికపై చర్చ

-

తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనుంది. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు.

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్విని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు ప‌రిచ‌యం చేయనున్నారు. మరోవైపు ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై ఈ భేటీలో చర్చించనున్నారు. ప్ర‌ధానంగా సింఘ్వి ఒక్క‌రే నామినేష‌న్ వేసిన‌ట్లయితే ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించనున్నారు.

కానీ కేశ‌వ రావు రాజీమానామాతో ఖాళీ అయిన స్థానం కావ‌డంతో బీఆర్ఎస్ నుంచి అభ్య‌ర్ధిని నిల‌బెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అలా జరిగితే ఎలా ముందుకు వెళ్లాల‌న్న దానిపై నేటి సీఎల్పీ సమావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.  కాంగ్రెస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి అభిషేక్ సింఘ్వి సోమవారం నామినేష‌న్ వేసే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news