కాంగ్రెస్​లో ముఖ్య నేతల చేరికకు ముహూర్తం ఖరారు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటోంది. అలా కాంగ్రెస్​లో కొంతమంది ప్రముఖులు చేరనున్నారు. వారి చేరికల ముహూర్తాన్ని తాజాగా హస్తం పార్టీ ఖరారు చేసింది. హైదరాబాద్‌లో ఈ నెల 17న నిర్వహించనున్న బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్​ చెందిన ఓ ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి సహా పలువురిని పార్టీలో చేర్చుకోనున్నట్లు తెలిసింది.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ల చేరిక ఖరారైనట్లు సమాచారం. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబ్‌నగర్‌లో గతంలో బీజేపీ తరఫున గెలుపొందిన యెన్నం శ్రీనివాసరెడ్డి సైతం ఈ నెల 17నే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. కొంతకాలంగా ఈయన కాంగ్రెస్‌ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీరితోపాటు మరికొందరితోనూ కాంగ్రెస్‌ నేతలు చర్చిస్తున్నట్లు తెలిసింది. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినందున, ఈ సభలోనే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల చేరికలు ఉండేలా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news