యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ మేనిఫెస్టో

-

తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు. మేనిఫెస్టో తెలుగు ప్రతిని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ విడుదల చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు చేసేలా దీన్ని తయారు చేసినట్లు నేతలు తెలిపారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం జరిగేలా మేనిఫెస్టో ఉందని చెప్పారు.

ఇప్పటివరకు ఐదు గ్యారంటీలు అమలు చేశాం. రాష్ట్రానికి అన్నిరకాలుగా మేలు చేసేలా మేనిఫెస్టో ఉంది. కాంగ్రెస్ నేతలు మరో 8 రోజులపాటు కష్టపడి ప్రచారం చేయాలి. అన్నివర్గాల ప్రజలకు లబ్ధి జరిగేలా మేనిఫెస్టో తయారు చేశాం. రాష్ట్ర అవసరాలు గుర్తించి మేనిఫెస్టో తయారు చేశారు. ఈ మేనిఫెస్టో రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఇస్తుంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ప్రతి గడప దగ్గరికీ తీసుకెళ్లాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ మేలు చేసేలా మేనిఫెస్టో ఉంది. అని హస్తం నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version