తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొట్ట మొదటి సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖసంతోషాలు నింపాలి’ అని ఆయన ఆకాంక్షించారు. ఇటీవల తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న కేసీఆర్…. హైదరాబాద్ నందినగర్ లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

KCR extends greetings to people on Sankranti

ఫిబ్రవరి నుంచి ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. కార్యకర్తలతో మమేకం అవడంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక అటు ఇందిరమ్మ ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలు భోగి, సంక్రాంతి, క‌నుమ పండుగ‌ల‌ను ఆనందంగా జ‌రుపు కోవాల‌ని, సంక్రాంతి పండుగ రైతుల జీవితాల‌తో పాటు ప్ర‌జ‌లంద‌రికి నూత‌న ఉత్సాహాన్ని తీసుకురావాల‌ని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోగీ, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.వరి ధాన్యం ఇంటికి చేరిన వేళ బందు మిత్రులతో, పశు పక్షాధులతో సంతోషంగా జరుపుకునే పండుగ ప్రతి ఇంట్లో వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news