గల్ప్ మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా విడుదల

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్ లో మృతి చెందిన కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం తాజాగా మొత్తం రూ.3కోట్ల 30 లక్షల ఎక్స్ గ్రేషియా ని విడుదల చేశారు. అయితే నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఓ ప్రకటనలో తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావుతో సమన్వయంతో చేసి నిధులు విడుదల చేయించానని అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 28 మంది జగిత్యాల 19, కామారెడ్డి 9, నిర్మల్ 7, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో  ఒక్కొక్కరి చొప్పున 66 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని వివరించారు. గతంలో 103 మందికి రూ.5 కోట్ల 15 లక్షల నిధులు విడుదల చేశారని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 169 మందికి రూ.8కోట్ల 45 లక్సలు చెల్లింపు అనిల్ వివరించారు. 

Read more RELATED
Recommended to you

Latest news