తెలంగాణ గ్రూప్‌ -4 మెరిట్‌ జాబితా విడుదల

-

తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధ్రువపత్రాల పరిశీలనకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీఎస్పీఎస్సీ) తేదీని ఖరారు చేసింది. కమిషన్.. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీనన జనరల్‌ ర్యాంకుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.  తాజాగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన మెరిట్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

ఎంపికైన అభ్యర్థులు ఈనెల 13వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకునేందుకు కమిషన్‌ అధికారులు అవకాశం కల్పించారు. ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని సూచించారు. వారిని మాత్రమే విడతల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన రోజు వారీ తేదీలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో అభ్యర్థులంతా ఈ విషయం గమనించి వారికి కేటాయించిన తేదీల్లో వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news