కొత్తగూడెం థర్మల్‌ స్టేషన్‌ కాలుష్యంపై నివేదికివ్వండి : హైకోర్టు

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్ వెదజల్లుతున్న కాలుష్యం తాజా పరిస్థితిపై మూడు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నుంచి బూడిద ఇతర కాలుష్యం కర్కవాగు, కిన్నెరసాని నదుల్లో కలుస్తున్న పీసీబీ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన దాసరి రమేష్‌ కుమార్‌ మరొకరు 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే, జస్టిస్‌ జె.అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ చేపట్టింది. 2022లో పీసీబీ అధికారులు సమర్పించిన నివేదికలో థర్మల్‌ స్టేషన్‌కు చెందిన అవక్షేపాల నిల్వకు ప్రత్యేకంగా ట్యాంకు ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయడం లేదని, ట్యాంకులోకి పంపకుండా నేరుగా కర్కవాగులోకి పంపుతున్నారని పేర్కొన్నారు. ఈ నివేదికకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఎలాంటి అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంతో పీసీబీ అధికారులు మరోసారి థర్మల్‌ స్టేషన్‌ను సందర్శించి కాలుష్యంపై తాజా పరిస్థితి గురించి మూడు వారాల్లో నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news