తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆసక్తికర ట్వీట్..!

-

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సంస్థ కొటువు తీరనుంది. మెడికల్ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్లో తన ఆర్ అండ్ డీ ఆఫ్ షోర్ డెవలప్మెంట్ సెంటర్ (ఓడీసీ) ఏర్పాటు చేయనుంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థతో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఒలింపస్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రులు డీ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి సమక్షంలో ఒలింపస్ కార్పొరేషన్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆర్ అండ్) సయ్యద్ నవీద్ ఈ విషయం ప్రకటించారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు. ఇవాళ న్యూయార్క్ ఒలింపస్ కార్పొరేషన్ ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆనందంగా ఉందన్నారు. ఒలింపస్ కార్పొరేషన్ తెలంగాణ, హైదరాబాద్ లకు ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. ఒలింపస్కు ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సంస్థ ఏర్పాటుకు వారు తెలంగాణను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీంతో స్థానిక ప్రతిభకు అపారమైన అవకాశాలు వస్తాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతలతో పని చేయడానికి, వైద్య సాంకేతికతలో ప్రపంచ ఆవిష్కరణలకు దోహదపడే వేదికను అందిస్తుందన్నారు. ఈ సంస్థ, హైదరాబాద్, తెలంగాణలో పరిశోధన, అభివృద్ధి కోసం మొత్తం పర్యావరణ వ్యవస్థను మెరుగుపరిచి, మరిన్ని పెట్టుబడులు, సహకారాలను ప్రోత్సహిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news