జగద్గిరిగుట్టలో దారుణం.. బాలుడిపై హత్యాయత్నం

-

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న ఆది (9) అనే బాలుడిని ఆటో డ్రైవర్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆపై పక్క వీధిలోకి తీసుకెళ్లి ఒక్కసారిగా బాలుడిపై విరుచుకుపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆటో డ్రైవర్ బాలుడు గొంతు కోసేసాడు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అయితే ఆటో డ్రైవర్ ఓ సైకోగా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version