పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విలీన దినోత్సవం..పాల్గొననున్న అమిత్ షా

-

హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఇందులో భాగంగానే పరేడ్‌ గ్రౌండ్స్ చేరుకున్నారు అమిత్‌ షా. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరుగనున్నాయి.

Telangana Liberation Day program at Hyderabad Parade Ground

ఇక ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున, మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ తరపున ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు.

గత 25 సంవత్సరాలుగా బిజెపి శాఖ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగురవేయడం జరుగుతున్నదని… విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బిజెపీ అని వెల్లడించారు. నిజాం కు వ్యతిరేకంగా లక్షలాదిమంది పోరాడిన పోరాటాన్ని చరిత్రను కాంగ్రెస్ పార్టీ సమాధి చేసే ప్రయత్నం చేసిందని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.అనేక మంది యోధులు భూమికోసం భుక్తి కోసం స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం నిజాంకు ఎదురు నిలబడి పోరాటం చేశారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version