పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

-

తెలంగాణలో పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 84 శాతం మంది అర్హత సాధించినట్లు పోలీసు నియామక బోర్డు వెల్లడించింది. సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపింది. కానిస్టేబుల్‌ సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ పోస్టులకు 98,218 మంది ఎంపికైనట్టు తెలంగాణ స్టేట్‌ లెవెల్  పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది.

కానిస్టేబుల్‌ ఐటీ అండ్ కమ్యూనికేషన్‌కు 4,564మంది, ఎస్సై సివిల్‌ 43,708 మంది, ఎస్సై ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 1,779 మంది, ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

ఈరోజు రాత్రి నుంచి అభ్యర్ధులు సాధించిన మర్కుల వివరాలు వెబ్‌సైట్ లో పెడతామని రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఫైనల్‌ కీ, ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌ సైట్‌ లో తమ వ్యక్తిగత లాగిన్ లో చూసుకోవచ్చని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news