నిరుద్యోగులకు శుభవార్త….. గ్రూప్ 1 నోటిఫికేషన్ రంగం సిద్ధం

-

తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగ భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. అసెంబ్లీ వేదికగా… బడ్జెట్ సమావేశాల్లో 80 వేలకు పైగా ఉద్యోగాలను ప్రకటించారు సీఎం కేసీఆర్. అందుకు తగ్గట్లుగానే అన్ని శాఖలు వారి పరిధిలో ఉన్న ఖాళీలతో నివేదికలు సిద్దం చేస్తున్నాయి. తాజాగా టీెఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దశల వారీగా ఎలాంటి న్యామపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం కమిషన్ కు సూచిస్తోంది. అన్నింటికన్నా ముందుగా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వాలని కమిషన్ భావిస్తోంది.

మొత్తం 12 శాఖల్లోని 19 రకాల పోస్టులకు ప్రతిపాదనలు టీఎస్పీఎస్సీకి అందాయి. అయితే వీటిలో నాలుగైదు విభాగాల ప్రతిపాదనల తయారీలో సాంకేతిక పొరపాట్లు తలెత్తాయి. వీటిని సవరించాలని కమిషన్ సూచించింది. ఈ సవరణల తరువాత సమాచారం అందిన వెంటనే కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. గ్రూప్ -1లో మొత్తం 503 పోస్టులు భర్తీ కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news