రేపు తెలంగాణలో వర్షాలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్

-

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం, శనివారం రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు.  ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాల్లోని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ప్రజలు వర్షాల వల్ల ఇబ్బందులు పడకుండా అధికారులు.. ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news