అశోక్ నగర్ లో ఉద్రిక్తత.. రోడ్డు పై బైఠాయించిన బండి సంజయ్..!

-

తెలంగాణలో గ్రూపు 1 అభ్యర్థులు గత కొంత కాలం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మొన్న చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్ ప్రాంతాల్లో నిరసన చేసిన గ్రూపు 1 అభ్యర్థుల పై పోలీసులు లాఠీ ఛార్జీలు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అవసరం అయితే అశోక్ నగర్ వస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ఇవాళ గ్రూపు 1 అభ్యర్థులకు మద్దతు తెలిపారు బండి సంజయ్.

దీంతో హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రూపు 1 అభ్యర్థులకు మద్దతుగా రోడ్డు పై బైఠాయించారు. అభ్యర్థుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. దీంతో బండి సంజయ్ కి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు గ్రూపు 1 అభ్యర్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version