థాక్రేతో ఆర్‌. కృష్ణయ్య భేటీ…కాంగ్రెస్‌ ముందు 18 డిమాండ్లు

-

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ థాక్రేతో ఆర్‌. కృష్ణయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 18 డిమాండ్ లపై థాక్రే కు లేఖ ఇచ్చానని ఆర్‌. కృష్ణయ్య పేర్కొన్నారు. దళిత డిక్లరేషన్ మాదిరిగా.. bc డిక్లరేశన్ పెట్టాలని కోరామని.. మళ్ళీ ఓ సారి కలుద్దాం అని చెప్పారని వివరించారు ఆర్‌. కృష్ణయ్య. అన్ని విషయాలు డిక్లరేషన్ లో పెడితే పార్టీకి కలిసి వస్తోంది అని చెప్పానని… పేర్కొన్నారు ఆర్‌. కృష్ణయ్య.

పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టి చట్ట సభలలో బి.సి లకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలని.. కేంద్ర ప్రభుత్వo త్వరలో చేపట్టబోయే జనాభ గణనలో బి.సి కుల గణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు ఆర్‌. కృష్ణయ్య. పంచాయతీరాజ్ సంస్థలో బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుండి 52 శాతం కు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని.. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి.ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news