ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. డేట్ ఫిక్స్

-

BREAKING: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు.

The alliance government has made a key announcement on free bus travel in AP

కూటమి సర్కార్ అధికారంలో వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం వంటిటి హామీలను ప్రభుత్వం ప్రారంభించింది.

అటు టీడీపీ కేసులు పెడుతున్న తరుణంలోనే వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పొడిగించారు. ఈ నెల 23 వరకు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు వైసీపీ నేతలు సజ్జల, నందిగామ సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్.

Read more RELATED
Recommended to you

Latest news