కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలతో కుదిరిన పొత్తు..ఈ 4 సీట్లు వారికే !

-

కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలతో పొత్తు కుదిరినట్లు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలతో పొత్తులో భాగంగానే.. సిపిఐకి రెండు స్థానాలు, సిపిఎంకి రెండు స్థానాలు ఇచ్చినందట కాంగ్రెస్. సిపిఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలు…సిపిఎంకి భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలు ఖరారు చేసిందట కాంగ్రెస్‌ పార్టీ.

ఇక ఇవాళ సీపిఐ, సీపిఎం పార్టీల ఉమ్మడి సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా పొత్తుల పై స్పష్టత ఇవ్వనున్నారు కామ్రేడ్లు.ఈ సమావేశం అనంతరం అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే.

నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ మేరకు నిన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే నిన్న ఎన్నికలపై ప్రకటన చేయడంతో… తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news