సేల్ఫీ తీసుకుని పురుగుల మందు తాగిన రైతు…!

-

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో దారుణం జరిగింది. బ్యాగరి నర్సింలు అనే రైతు తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసాడు. అక్కడ ఉన్న స్థానికులు… వెంటనే స్పందించింది… సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అతను కన్ను మూసాడు. తనకున్న 13 గుంటల పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రికార్డులో ఎక్కించడం లేదని ఆవేదన వ్యక్తం చేసాడు.

భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని బలవంతం చేయడంతో ఆవేదనతో పురుగుల మందు తాగడని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ ఫోటో, వాయిస్ రికార్డు చేసాడు అతను. దీనితో… గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ ఇంటి ముందు మృతుని కుటుంబీకులు ధర్నా చేస్తున్నారు. దీనితో అక్కడ పోలీసులు భారీగా మొహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news