హైదరాబాద్‌ లో మరో దిశా కేసు..మహిళపై పెట్రోల్‌ పోసి చంపిన దుండగులు !

-

హైదరాబాద్‌ లో దిశా లాంటి మరో కేసు నమోదు అయింది. ఓ మహిళపై పెట్రోల్‌ పోసి చంపారు కొంత మంది దుండగులు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… శంషాబాద్ లోని సాయి ఎన్ క్లేవ్ లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని స్థితిలో కాలిపోయి ఉన్న మహిళ మృతదేహం లభ్యం అయింది. గుర్తు తెలియని మహిళ ఒంటిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం.

మహిళ ఆనవాళ్ళు కనిపించకుండా నిప్పటించారట దుండగులు. మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయిందని పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం.. డాగ్ స్క్వాడ్.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళను ఎవరు.? ఎందుకు హత్య చేశారు.? మహిళపై అత్యాచారయత్నం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ల మహిళగా గుర్తించారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news