BREAKING : పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యాగంలో అపశ్రుతి

-

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికు ఊహించని పరిణామం ఎదురైంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యాగంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గత పదమూడు రోజులుగా యాగం నిర్వహిస్తున్నారు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దంపతులు.

ఈ రోజు చివరి రోజు అయిన నేపథ్యంలో ప్రధాన యాగశాలలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పూజ మండపం పూర్తిగా కాలిపోయింది. ప్రధాన యాగం దగ్గర నిప్పురవ్వలు ఎగిరి పడడంతో టెంట్ కు వ్యాపించాయి మంటలు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అర్పింది ఫైర్ సిబ్బంది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version