పవన్ కళ్యాణ్‌ భార్యలపై అడపా శేషు వివాదస్పద వ్యాఖ్యలు

-

కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయం అంటూ ఫైర్‌ అయ్యారు. నిన్ను చూసుకోమని మేం ఏ భార్యకు చెప్పాలి పవన్? నీ మొదటి పెళ్లానికా…రెండో పెళ్లానికా…మూడవ పెళ్లానికా? అంటూ రెచ్చిపోయారు. నీ కుటుంబాన్ని ఎక్కువగా తిట్టింది టీడీపీ వాళ్లేనని.. ప్యాకేజీ వల్ల ఆ మాటలన్నీ మర్చిపోయుంటావంటూ ఆగ్రహించారు.

చంద్రబాబు, పరిటాల రవి చేసిన అవమానాలను మర్చిపోయావని.. మహిళలంటే నీకు మరీ అంత చిన్నచూపాఅని ఆగ్రహించారు. స్త్రీలకు గౌరవం ఇచ్చిన చరిత్ర పవన్ కు లేదని.. ప్రతీ సంక్షేమ పథకంలో మహిళలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో జనసేన పార్టీ శ్రేణులు చేస్తున్న అరాచకాలను బయటపెడతామని హెచ్చరించారు. నిన్ను రెండు చోట్లా ఓడించింది టీడీపీ పార్టీ కాదా అని.. రేపు మళ్లీ నిన్ను ఓడించేది కూడా టీడీపీనే అంటూ ఆరోపణలు చేశారు అడపా శేషు.

Read more RELATED
Recommended to you

Exit mobile version