బీఆర్ఎస్ ను ముక్కలు చేసే వాళ్లు ఇంకా పుట్టలేదు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ని ముక్కలు చేసే వాళ్ళు ఇంకా పుట్టలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 50 రోజులకు పైగా అవుతోందని.. నాటి నుంచి అభివృద్ధిని పక్కన పెట్టి నిర్విరామంగా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.. సీఎం సహా మంత్రులందరూ తిడుతుంటే తాము పడాలని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పదవి వచ్చాక కూడా రేవంత్ లో మార్పు కనిపించడం లేదని.. కొంచెం ముందుగా ఉండడం నేర్చుకోవాలని హితం పలికారు. బీఆర్ఎస్ ని బొంద పెట్టే మొనగాడు పుట్టలేదన్నారు. గతంలో కేటీఆర్ దావోస్ వెళ్ళినప్పుడు కేటీఆర్ ఎంతో హుందాగా ప్రవర్తించారు. సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని గుర్తు చేశారు. దేశంలోనే రోల్ మోడల్ తెలంగాణను అభివృద్ధి చేసింది కేసీఆరే. అలాంటి కెసిఆర్ ని తులనాడటం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని తెలిపారు. కేసిఆర్ నీ అనవసరంగా ఓడించామని బాధపడుతున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news