అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. పార్కింగ్‌లో ఉంచిన మూడు బస్సులు దగ్ధం

-

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఐడీఎల్‌ చెరువు సమీపంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్‌లో ఉంచిన బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భారతి ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పివేశారు.

అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న బస్సులను అక్కడినుంచి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎవరైనా నిప్పుటించారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version