BREAKING : సూర్యాపేటలో ఆటో-బస్సు ఢీకొని ముగ్గురి మృతి

-

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి. రోజూ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అలా రోజూలాగే ఇవాళ కూడా వ్యవసాయ పనులకు బయల్దేరారు. మిరప తోటలో పనుల కోసమని ఆటోలో వెళ్తున్న వారు.. దారిలో మృత్యువు కాచుకుని కూర్చొందని గమనించలేకపోయారు. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు దూసుకురావడంతో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

ఇవాళ ఉదయం జిల్లాలోని మోతె సమీపంలో ఆటో-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 13 మంది ప్రయాణిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు మునగాల మండలం రామసముద్ర వాసులుగా గుర్తించారు. వీరంతా ఆటోలో మోతె మండలం బుర్కచర్లలో మిరప పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news