గద్వాల జిల్లాలో ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

-

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధరూర్ సమీపంలోని గోనుపాడు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గోనుపాడు వద్ద సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద ఇవాళ ఉదయం వేగంగా దూసుకొచ్చిన బొలెరో అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులను గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని దౌదర్పల్లికి చెందిన జమ్ములు (45), అర్జున్‌, వైశాలిగా గుర్తించారు.

వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. వీరంతా పాత బట్టలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారని చెప్పారు. గద్వాల నుంచి కర్ణాటకలోని రాయ్‌చూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్‌ అక్కడినుంచి పరారయ్యాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news