ఎల్బీనగర్‌.. ఇక నుంచి ‘శ్రీకాంతాచారి జంక్షన్‌’

-

హైదరాబాద్​లో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లలో ఎల్బీ నగర్ జంక్షన్ ఒకటి. అంతకుముందు ఎల్బీ నగర్ రింగు రోడ్డు, ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్డుగా పేరుగాంచిన ఈ రహదారి.. ప్రస్తుతం జరిగిన అభివృద్ధితో ఎల్బీ నగర్ జంక్షన్​గా రూపొందింది. అయితే ఎల్బీనగర్‌ జంక్షన్‌ పేరును కూడా త్వరలో మార్చబోతున్నారట. మరి దీనికి పెట్టబోతున్న కొత్త పేరేంటో తెలుసా..?

ఎల్బీ నగర్ జంక్షన్​ను ఇక నుంచి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ జీహెచ్​ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 11 అంశాలకు స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఎల్బీనగర్‌ జంక్షన్‌కు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా, ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన ఎల్బీనగర్‌ ఆర్‌హెచ్‌ఎస్‌ వంతెనకు మాల్‌ మైసమ్మ ఫ్లైఓవర్‌గా నామకరణం చేసేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదించినట్లు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news