మాదాపూర్ లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్..!

-

మాదాపూర్ లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని అరెస్ట్ చేసారు పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నప్పటికీ లాభాలు లేకపోవడంతో.. పెద్ద మొత్తంలో లాభాలు గడించాలని డ్రగ్స్ అమ్మకాలకు తెరలేపారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.

మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్నారని సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కాపు కాసి డ్రగ్స్ అమ్మకాలకు ప్రయత్నిస్తున్న సమయంలో ముగ్గురిని పట్టుకున్నారు. ఈ ముగ్గురి వద్ద 5.77 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. డ్రగ్స్ తో పట్టుబడిన వారిలో దత్తి లితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి ఏ మార్ట్ ఉన్నారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు. అయితే బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి చేసే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news