Thugs erased the car mark in the EVM: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కారు పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఈవీఎంలో కారు గుర్తు చెరిపేశారు కొంత మంది దుండగులు. గద్వాల జిల్లా పైపాడులో ఈ వివాదం తెరపైకి వచ్చింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఈవీఎంలో కారు గుర్తు కనిపించకుండా మార్క ర్తో రుద్దడంతో వివాదం నెలకొంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/Thugs-erased-the-car-mark-in-the-EVM.jpg)
ఈ బూత్లో మొత్తం 1,196 ఓట్లు ఉండగా 848 ఓట్లు పోలైన తర్వాత వచ్చిన ఓటరు దీనిని గమనించి అధికారులకు తెలియ జేశారు. భారాస నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి సిబ్బందితో మాట్లాడి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.