LB నగర్ లో విషాదం..బిక్షాటన చేసే మహిళను హత్య చేసిన దుండగులు !

-

హైదరాబాద్‌ లోని L.B నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ గొంతు కోసి హత్య చేశారు కొందరు దుండగులు. ఈ సంఘటన ఆది వారం రోజున చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. L.B నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.

Thugs who killed a begging woman

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కనే ఓ మహిళను గొంతు కోసి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. మహిళను హత్య చేసిన ప్రదేశం పక్కనే పది అడుగుల దూరంలోనే రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయం ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మృతురాలు బిక్షాటన చేసే మహిళగా గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు L.B నగర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news