కాంగ్రెస్ లోకి వెళ్లేది..కార్యకర్తలతో చర్చించి ప్రకటిస్తా – తుమ్మల

-

కాంగ్రెస్‌ పార్టీలో చేరేంది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ తుమ్మల ఇంటికి.. కాంగ్రెస్ ప్రచార కమిటీ కోర్ ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రావడంపై మరింత ఉత్కంఠ సంతరించుకుంది. ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ పార్టీలో చేరికపై తుమ్మల క్లారిటీ ఇవ్వలేదు.

హస్తం పార్టీలోకి తనను ఆహ్వానించినందుకు పొంగులేటితో భేటీ అనంతరం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సీతారామ నుంచి గోదావరి జలాల విడుదలను చూడాలన్నదే తన కోరిక అని చెప్పారు. ఆ ప్రాజెక్టు కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్య కర్తలు, సన్నిహితుల సలహాతో త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తుమ్మలకు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో… కాంగ్రెస్ తనను ఆహ్వానించిందని ఇప్పటికే చెప్పిన ఆయన…కాంగ్రెస్‌లో చేరతారా లేదా అనే అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. అనుచరులు, అభిమానులతో చర్చించాక నిర్ణయాన్ని వెల్లడిస్తానని తుమ్మల పునరుద్ఘాటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news