కేసీఆర్‌కు నేనే మంత్రి పదవి ఇప్పించా: తుమ్మల

-

కేసీఆర్‌కు నేనే మంత్రి పదవి ఇప్పించానంటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు 1995లో తానే మంత్రి పదవి ఇప్పించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘పాలేరు సభలో కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడారు.

thummala vs cm kcr
thummala vs cm kcr

అప్పట్లో నేనే ఆయనకు మంత్రి పదవి ఇప్పించా. కానీ ఆ విషయం కెసిఆర్ మర్చిపోయి నాకు మంత్రి పదవి ఇచ్చాను అంటున్నారు. 2018 ఎన్నికల్లో పాలేరులో నన్ను ఓడించడానికి కేటీఆర్ కుట్రపన్నారు. నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి నన్ను ఓడించారు’ అని తుమ్మల మండిపడ్డారు.

ఇక నిన్న పాలేరు సభలో తుమ్మల నాగేశ్వరరావుపై హాట్‌ కామెంట్స్‌ చేశారు సీఎం కేసీఆర్. తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవీ ఇచ్చాను. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ మోసం చేసింది అంటున్నాడు.. ఆయనను బీఆర్ఎస్ మోసం చేసిందో.. బీఆర్ఎస్ ను ఆయన మోసం చేశాడో మీరే చెప్పాలన్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news