మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు

-

భూమిపైన అత్యంత విలువైన వస్తువు… ఏదైనా ఉందంటే అది కేవలం బంగారం మాత్రమే. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.


చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరిగి పోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 52,100 గా నమోదు కాగా…. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 47,750 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరిగి పోయాయి. కేజీ వెండి ధర రూ.800 తగ్గి రూ.73,400 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version