ఇవాళ సిరిసిల్లాకు సీఎం రేవంత్..కండోమ్ ప్యాకెట్ల సెగ తగులనుందా ?

-

ఇవాళ ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి జన జాతర సభకు హాజరుకానున్నారు సీఎం రేవంత్‌. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జన జాతర సభకు హాజరుకానున్నారు. ఇక ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌.

Today Sirisilla will get CM Revanth

అయితే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో పర్యటిస్తున్న నేపథ్యంలో పద్మశాలీలు అలాగే గులాబీ పార్టీ నేతలు నిరసనలకు దిగుతున్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పద్మశాలీలు కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోవాలంటూ సెటైర్లు పేల్చారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలిలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే సిరిసిల్లలో అడుగు పెట్టాలని పద్మశాలీలు హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news