ఈఏపీ సెట్‌ ఫలితాలు.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీలో టాప్‌ 5 ర్యాంకర్లు వీరే..

-

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ (TG EAPCET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,40, 618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. . ఇంజినీరింగ్‌లో 74.98 శాతం మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీలో 89 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం.

ఇంజినీరింగ్‌లో ర్యాంకులు..

  • మొదటి ర్యాంకు-ఎస్‌.జ్యోతిరాదిత్య(శ్రీకాకుళం-పాలకొండ)
  • రెండో ర్యాంకు- హర్ష(కర్నూలు-పంచలింగాలు
  • మూడో ర్యాంక్‌-రిషి శేఖర్‌ శుక్లా(సికింద్రాబాద్‌-తిరుమలగిరి)
  • నాలుగో ర్యాంకు-సందేశ్‌(హైదరాబాద్‌-మాదాపూర్‌)
  • ఐదో ర్యాంకు-సాయి యశ్వంత్‌ రెడ్డి(కర్నూలు)

అగ్రికల్చర్‌, ఫార్మసీలో ర్యాంకులు..

  • మొదటి ర్యాంకు-ప్రణీత(మదనపల్లె)
  • రెండో ర్యాంకు-రాధాకృష్ణ(విజయనగరం)
  • మూడో ర్యాంకు-శ్రీవర్షిణి(హనుమకొండ)
  • నాలుగో ర్యాంకు-సాకేత్‌ రాఘవ్‌(చిత్తూరు)
  • ఐదో ర్యాంకు- సాయి వివేక్‌(హైదరాబాద్‌-ఆసిఫ్‌నగర్‌)

Read more RELATED
Recommended to you

Latest news