ఫిల్మ్‌ నగర్‌ లో విషాదం..2 ఏళ్ల బాలుడికి ఉరేసి..తల్లి ఆత్మహత్య

-

 

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక 2 ఏళ్ల బాలుడికి ఉరేసి..తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిల్మ్ నగర్ లో విశ్వనాథ్, శిరీష..నివాసం ఉంటున్నారు.

వీరికి రెండున్నర ఏళ్ల బాలుడు మనీష్ ఉన్నాడు. అయితే.. అత్తింటి వేధింపులు భరించలేక కుమారుడు మనీష్ కి ఉరి వేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది శిరీష. శిరీష ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అని తెలిపారు పోలీసులు. గత రాత్రి ఫిల్మ్ నగర్ వినాయక నగర్ లో ఈ ఘటన సంఘటన చోటు చేసుకుంది. ఇక మృత దేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఫిల్మ్ నగర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news