విద్యుత్ శాఖ పై రివ్యూకు సంబంధించి నాకు సమాచారం ఇవ్వలేదు : ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు

-

తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విద్యుత్ పై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.  విద్యుత్ సామీక్ష నిర్వహించారు. విద్యుత్ సమీక్షకు ట్రాన్స్ కో, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు హాజరు కాలేదు. ఈ విషయంపై మీడియా సీఎండీ ప్రభాకర్ రావును సంప్రదించగా.. ఆయన ఇలా స్పందించారు.

సెక్రటేరియట్లో విద్యుత్ శాఖ పై రివ్యూకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ముఖ్యమంత్రి పిలిస్తే నేను వెళ్లకుండా ఎందుకుంటానండి.. విద్యుత్ శాఖ నుంచి కానీ సీఎం నుంచి కానీ నాకు ఎలాంటి ఆహ్వానం లేదని స్పష్టం చేశారు. నన్ను పిలిస్తే ఖచ్చితంగా సమావేశాన్ని హాజరవుతానని క్లారిటీ ఇచ్చారు. తాజాగా సీఎండి ప్రభాకర్ రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ సీఎం సునీల్ శర్మ, సింగరేణి సీఎం డి శ్రీధర్, విద్యుత్ శాఖ  జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు విద్యుత్ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ కొనుగోలు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నతాధికారులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news